Header Banner

ఏపీలో ఆరేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు అలర్ట్..! ఈ నెల 5 నుంచి పక్కా, మంచి ఛాన్స్!

  Sat May 03, 2025 06:37        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 8 వరకు.. 12 నుంచి 15 వరకు రెండు దశల్లో ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 0-6 ఏళ్లలోపు చిన్నారుల కోసం ప్రత్యేకం ఈ ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఆధార్ నమోదు కోసం తల్లిదండ్రులు చిన్నారుల జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికేట్) ఒరిజినల్‌ పత్రాలను ప్రత్యేక శిబిరాల్లో చూపించి ఆధార్‌ నమోదు చేయించాలని సూచించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,07,358 మంది చిన్నారులు జనన ధ్రువీకరణ పత్రం పొందినా సరే.. ఇంకా ఆధార్‌ నమోదు చేయించుకోలేదని తెలిపారు. ఒకవేళ ఇప్పటికే ఆధార్‌ నమోదు చేయించుకొంటే.. ఇదే విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలియజేసి ఈ మేరకు రికార్డుల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్ నమోదు చేయించుకోని వారు ఈ ప్రత్యేక శిబిరాల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గతంలో కూడా ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని అప్డేట్స్ ఇలా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో మరుగుదొడ్లను పెంచాలని, గిరిశిఖర గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి గిరిజన ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డోలీల రహిత గ్రామాలు ప్రభుత్వ లక్ష్యమని.. దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 'విశాఖపట్నం కేంద్రంగా జూన్‌ 9, 10 తేదీల్లో ‘ఈ-గవర్నెన్స్‌’పై జాతీయ సదస్సు (ఎన్‌సీఈజీ) నిర్వహించనున్నారు. వికసిత్‌ భారత్, సివిల్‌ సర్వీస్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పేరిట నిర్వహించే ఈ సదస్సులో ఆరు ప్లీనరీ, ఆరు బ్రేక్‌ అవుట్‌ సెషన్లు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించి, ‘ఐటీ హబ్‌గా వైజాగ్‌’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్‌ కీలక ఉపన్యాసాలు చేయనున్నారు' అని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AadhaarUpdate #APGovt #ChildAadhaar #ParentAlert #June5 #AadhaarCamp #DigitalIndia #APNews